బెంగళూరు (అక్షరవేకువ) ఆగస్టు 07
దేశంలో బీసీల హక్కులను కాలరాయడాన్ని సహించబోమని, 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లేదంటే ఉద్యమ పోరాటాలు తీవ్ర రూపం దాల్చుతాయని బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా హక్కులు, పదవులు, ఉద్యోగాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో బీసీల హక్కులను కాలరాయడాన్ని సహించబోమని, 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లేదంటే ఉద్యమ పోరాటాలు తీవ్ర రూపం దాల్చుతాయని బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా హక్కులు, పదవులు, ఉద్యోగాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జాతీయ సదస్సులో సమీక్ష
శుక్రవారం బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న వక్తలు, బీసీల హక్కులపై అధికార పార్టీల వ్యవహార తీరుపై సమీక్షించారు. త్వరలోనే బీసీ సంఘాల ఉమ్మడి వేదికతో జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఉద్యమానికి పిలుపు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో బీసీలు బలపడితేనే రాజకీయంగా చైతన్యవంతంగా ముందుకు కదిలే అవకాశం ఉందని తమ ప్రధాన ఎజెండాగా ఉందని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు
అందుకే బెంగళూరులో ఈ జాతీయ సదస్సును కేంద్రంలో బీసీ మంత్రి, షెడ్యూల్ 9 కేటాయింపు, 4 ప్రధాన డిమాండ్ల కోసం నిర్వహించినట్లు నేతలు వెల్లడించారు. డాక్టర్ నీలకంఠతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.












