నర్సాపూర్, 2026-08-06
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం నర్సాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, బీసీ ఉద్యోగ భవన నిర్మాణానికి కృషి చేస్తామని సంఘం నాయకులు తెలిపారు.
బీసీ ఉద్యోగుల సంఘం నర్సాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఆశయాలు, ఆకాంక్షలను స్ఫూర్తిగా తీసుకోవాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ భావజాల వ్యాప్తికి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని బీసీ ఉద్యోగ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు కే. శేష చారి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో జయశంకర్ దిక్సూచిగా నిలిచి మార్గదర్శనం చేయడం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైందని బీసీ ఉద్యోగ సంఘం నర్సాపూర్ డివిజన్ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ అన్నారు. త్వరలోనే నాయకులను, అధికారులను కలిసి నరసాపూర్ డివిజన్ కేంద్రంలో బీసీ ఉద్యోగ భవన నిర్మాణానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కూడా ఐక్య ఉద్యమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘం నర్సాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇ.వెంకటకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్, డివిజన్ కోశాధికారి కృష్ణ, జిల్లా బాధ్యులు నరేష్, డివిజన్ బాధ్యులు పండరి జగదీష్, రవియంతి పాల్గొన్నారు.











