మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 08
ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 8వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి విద్యార్థులు, యువకులు తరలిరావాలని కోరుతూ మంచిర్యాలలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు చిప్పకుర్తి సతీష్ మాదిగ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మందకృష్ణ మాదిగ అని, ఆయన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకమని తెలిపారు.
ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 8వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుంచి విద్యార్థులు, యువకులు తరలిరావాలని కోరుతూ మంచిర్యాలలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాయకులు చిప్పకుర్తి సతీష్ మాదిగ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మందకృష్ణ మాదిగ అని, ఆయన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకమని తెలిపారు.
ఆరోగ్యశ్రీ ఆవిర్భావం
గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించి, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 2004 ఆగస్టు 7న ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం ఆవిర్భవించిందని, ఇది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుపేదలకు ఆరోగ్యశ్రీ బీమా ఒక సంజీవనిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఆయుష్మాన్ భారత్ కు స్ఫూర్తి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2004 ఆగస్టు 7న మందకృష్ణ మాదిగ గారు నడిపిన ఉద్యమ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకమని, దానిని స్ఫూర్తిగా తీసుకునే నేడు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని అన్నారు. కులం, మతం కన్నా మానవత్వమే ముఖ్యమని భావించే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా సామాజిక, మానవతా ఉద్యమాలను నిర్మించి ప్రజలందరికీ సంక్షేమ, ఆరోగ్య ఫలాలను అందించారని కొనియాడారు.
భవిష్యత్ కార్యాచరణకు మద్దతు
కులరహిత సమాజం కోసం, ఆర్థికంగా అందరూ ఎదగడం కోసం, అన్ని వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించడం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు సమాజమంతా మద్దతుగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సామాజిక దండోరా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.











