మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 08
మంచిర్యాలయన్స్ పట్టణంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల, లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లఉచిత కంటి వైద్య నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరంలో 85 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 20 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.
మంచిర్యాల పట్టణంలో ఈరోజు లైన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి 85 మంది ప్రజలు పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.
వైద్య పరీక్షలు, చికిత్సల వివరాలు
లయన్ డాక్టర్ అభిషేక్ నేతృత్వంలో వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. ఈ పరీక్షల అనంతరం 20 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. వీరిని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన రేకుర్తి, కరీంనగర్ లోని ఐ హాస్పిటల్ కు తరలించి, అన్ని వసతులతో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ డాక్టర్ నరేష్, కార్యదర్శి లయన్ వేణు, లయన్ ఎం. వెంకటేశ్వర్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.












