మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 18
మంచిర్యాల జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగంగా దాదాపు 1.20 లక్షల ఓట్లను తొలగించినట్లు జిల్లా ఆర్డీఓ గూడూరిఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆర్డీఓ స్పష్టం చేశాశారు.
మంచిర్యాల జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగంగా దాదాపు 1.20 లక్షల ఓట్లను తొలగించినట్లు జిల్లా ఆర్డీఓ గూడూరి శ్రీనివాసరావు తెలిపారు. మరణించిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆర్డీఓ స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా ఓట్ల వివరాలు
జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గతంలో 6,61,046 ఓట్లు ఉండగా, వడపోత అనంతరం 5,45,925 ఓట్లు మిగిలాయని ఆర్డీఓ వివరించారు. దీని ప్రకారం లక్షకు పైగా ఓట్లను తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గంలో 2,17,498 ఓట్లు, చెన్నూర్ నియోజకవర్గంలో 1,69,396 ఓట్లు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,59,000 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇదిలా ఉండగా, స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ, మొదట 55 మందికి మాత్రమే కార్డులు అందించామని, మిగిలిన వారికి దశలవారీగా అందిస్తామని ఆర్డీఓ చెప్పారు. మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పంపిణీ కార్యక్రమం త్వరలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భూముల తగాదాలపై స్పందన
ప్రజలకు భూముల తగాదాలకు సంబంధించిన సమాచారం, పలు విధాల ఒత్తిళ్లు జరగకుండా తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీఓ శ్రీనివాసరావు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తమ ముందుకు తీసుకురావచ్చని ఆయన వెల్లడించారు.












