కోకాపేట, హైదరాబాద్, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
హైదరాబాదులో నిర్మిస్తున్న మననాప సంఘం 6వ వార్షిక సమావేశంలో, సంఘ భవనంలో 5 లక్షల చెక్కును అందించిన తోట శ్రీనివాస్ జయాధికారం వైపుకు ప్రారంభించినారు
హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు సంఘం 6వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం రావు పటేల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, మంచిర్యాల పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్, కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఇప్పటికే రూ. 1 లక్ష అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. సంఘ భవన నిర్మాణానికి తమకు తోచినంత ఆర్థిక సహాయం చేయాలని కోరారు.











