తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన 5వ తెలంగాణ రాష్ట్ర కోచ్లు మరియు జడ్జిల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రతినిధులు తమ ప్రతిభను చాటుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన కోచ్లు, జడ్జిలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, యోగాసన క్రీడకు సంబంధించిన సాంకేతిక అంశాలు, న్యాయనిర్ణయ విధానాలు, పోటీల నిర్వహణ ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ పొందారు.
మంచిర్యాల జిల్లా నుండి రేవెల్లి రోహిత్ మాస్టర్ ట్రైనర్గా పాల్గొని, తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని శిక్షణార్థులతో పంచుకున్నారు. జిల్లా నుండి చి. రాహుల్, టి. వైష్ణవి ట్రైనీ జడ్జిలుగా, టి. హర్షిణి, గీతా దేవి ట్రైనీ కోచ్లుగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.
మంచిర్యాల జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కల తిరుపతి వర్మ, ప్రధాన కార్యదర్శి మండ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరచడం ఆనందదాయకమని తెలిపారు.
వారు మాస్టర్ ట్రైనర్ రేవెల్లి రోహిత్ గారిని అభినందించారు. శిక్షణ పూర్తి చేసిన ట్రైనీ జడ్జిలు, కోచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో యోగాసన క్రీడాభివృద్ధికి మరింత కృషి చేసి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.











